ఇందిరమ్మ కాలనీలో శనివారం ఉదయం బొబ్బిలిమున్సిపల్ కమిషనర్ ఎల్ రామలక్ష్మి పర్యటించారు. కాలనీలో ఖాళీ స్థలంలో ఏరివేయాలని, కాలనీ చివరి లైన్ లో ఉన్న కాలువకు అవుట్లెట్లు ఏర్పాటు చేయాలని శానిటేషన్ అండ్ ఎన్విరామెంటల్ సెక్రెటరీ వారికి ఆదేశించారు. ఇటీవల తవ్వించడం కచ్చా కాలువను పరిశీలించారు. తదుపరి పోలవానివలస స్మశాన వాటికలో నిర్మాణ దశలో ఉన్న ప్రహరీ గోడను పరిశీలించి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కి సూచనలు జారీ చేశారు.