పహల్గామ్ ఉగ్రవాద ఘటనకు ప్రతీకార చర్యగా భారత సైన్యం పాకిస్థాన్పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం కావడంపై దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బొబ్బిలి పట్టణం లో మాజీ సైనికుల ఆధ్వర్యంలో రేపు (శనివారం) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గుంటారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు పాల్గొవలసిందిగా పిలుపునిచ్చారు.