రామభద్రపురం శాఖా గ్రంధాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతులలో శనివారం విజ్ఞానశాస్త్ర విశేషాలపై అవగాహన కల్పించినట్లు లైబ్రేరియన్ సత్యవాణి తెలిపారు. విద్యార్థులచే పుస్తక పఠనం చేయించి, మానవ శరీరంలోని వివిధ భాగాలు, వాటి పని తీరు గురించి వివరించారు. అనంతరం విద్యార్థుల మెదడుకు పదును పెట్టే వివిధ ఆటలను ఆడించారు.