రోడ్డు పై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని బుదరాయవలస ఎస్ ఐ లోకేశ్వరరావు అన్నారు. శుక్రవారం మెరకముడిదాం మండలం లో గల గర్భాం ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్స్ కు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు పైకి వాహనం తీసుకుని వచ్చిన ప్రతి చోడకుడు ట్రఫిక్ రూల్స్ ను పూర్తిగా తెలుసుకొని వాహనాలను నడపాలన్నారు. అవగాహన లేని డ్రైవింగ్ ప్రమాదాలకు దారి తీస్తుందని, అతి వేగం ప్రాణాలకే ప్రమాదం అని ఆయన అన్నారు.