మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని గజపతినగరం ఎస్. ఐ మహేష్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం గజపతినగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ లో జాతీయ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురికి అపరాద రుసుం విధించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.