లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి బి. కనకలక్ష్మి సూచించారు. మంగళవారం కోర్టులో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. మార్చి ఎనిమిదో తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీపడేలా చేయాలన్నారు. సిఐ జిఏవి రమణ, ఎస్ఐలు పాల్గొన్నారు.