గజపతినగరం మండల తహసిల్దార్ గా బొంతు రత్నకుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల విధులు నిమిత్తం ఇతర జిల్లాకు వెళ్లి తిరిగి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు తహసిల్దార్ రత్న కుమార్ కు ఉప తహసిల్దార్ సత్యనారాయణ, సీనియర్ సహాయకులు మురళి, రీ సర్వే డిటి జోగి నాయుడు రెవెన్యూ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.