గుమ్మలక్ష్మిపురంలో ఉన్న యూత్ ట్రైనింగ్ కేంద్రాన్ని కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడ ఉన్న గర్భిణులతో మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వారికి అందే సౌకర్యాలపై వారిని ఆరా తీశారు. ఆమె మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో అంచనాలతో ఈ కేంద్రాలను ప్రారంభించిదని వైసీపీ ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేశారన్నారు.