కురుపాం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం వైన్ షాప్ సిబ్బంది ఆందోళనకు దిగారు. మద్యం షాపు ముందు బైటాయించి తమకు ఉద్యోగ భద్రత కల్పించి నూతన ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ డిమాండ్ చేసారు.
వైసీపీ ప్రభుత్వంలో తమకు
ఉద్యోగాలు వచ్చాయని ఆ జీతాలతోనే కుటుంబాన్ని నెట్టుకువస్తున్నామని ఇప్పుడు
ఉద్యోగాలు తొలిగిస్తే మా పరిస్థితితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసారు. నూతన ప్రభుత్వం తమ ఉద్యోగాలను కొనసాగించాలని కోరారు.