భోగాపురం మండలం చేపల కంచెరు అనధికార మద్యం దుకాణం పై ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. 9 మద్యం బాటిల్స్ పట్టుకొని ఆ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ. వి. రవికుమార్ తెలిపారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై సమాచారం అందించినట్లు అయిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. దాడుల్లో ఎస్సై చంద్రమోహన్, రామారావు, కానిస్టేబుల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.