రైతుల భూ సమస్యల పరిష్కారానికి సత్వర కృషి చేస్తామని ఆర్డిఓ దాట్ల కీర్తి అన్నారు. భోగాపురం మండలం రావాడ లో ఆదివారం జరిగిన రీ సర్వే గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. సమావేశంలో ఆమె రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. రైతుల ఫిర్యాదుల మేరకు అవసరమైన చోట రీ సెర్వె నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.