ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (APGEA) పాలకొండ తాలూకా యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక సీతంపేట సమావేశ మందిరంలో శనివారం జరిగింది. అధ్యక్షుడిగా బబ్బురు గణేశ్ బాబు, కార్యదర్శిగా రాంజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా నాయకుడు నూతలపాటి భరత్ భూషణ్ వ్యవహరించారు. అనతరం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.