పాలకొండ మండలం కొండాపురంలో గ్రామకంఠం భూములు అన్యాక్రాంతం అయ్యాయని గ్రామానికి చెందిన కరణం మురళీ దీక్ష ప్రారంభించారు. భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని, అందుకే నిరసనగా పాలకొండ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం దీక్ష చేపట్టినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి క్రయవిక్రయాలు చేపట్టారని ఆరోపించారు.