విద్యార్థుల సమగ్ర ఆరోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆరోగ్య పరిరక్షణ నిరంతర పర్యవేక్షణకు సమగ్ర ఆరోగ్య కార్డులు (ఇంటిగ్రేటెడ్ హెల్త్ కార్డులు)జారీ చేయుటకు కార్డులు సిద్ధం చేయాలని అన్నారు. బుధవారం కలెక్టరు కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిసిసి తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.