పార్వతీపురం ఐటిడిఎ పరిధిలో చేపడుతున్న పిఎం జన్మన్ గృహ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని పిఒ అశుతోష్ శ్రీవాత్సవ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబరులో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐటిడిఎ పరిధిలో పిఎం జన్మన్ గృహ నిర్మాణాలపై అధికారులు మరింత ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని చెప్పారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు.