రాష్ట్ర విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కు ఉపాధ్యాయ సంఘ నేతలు బదిలీల పై విజ్ఞప్తి చేశారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా లో మంత్రి పర్యటించారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయు సంఘం నాయకులు మంత్రి ను మర్యాదపూర్వకంగా కలిశారు. బదిలీల ప్రక్రియను వెబ్ విధానంలో చేయవద్దని నాయకులు కోరారు. మంత్రి స్పందిస్తూ మీరు అడిగిందంతా మేము చేశాం, ఐ యామ్ సారీ సార్. చట్టాన్ని నేను ఉల్లంఘించలేను అంటూ సమాధానమిచ్చారు.