రాజాం మండలం పొగిరి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను శనివారం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సీఐ ఆర్. జైభీమ్, తమ సిబ్బందితో పట్టుకున్నారు. ఈ మేరకు వారి వద్దనుండి 31 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేశారు. నియోజకవర్గంలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమం ఎస్ఐ మాన్యాలు, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు