ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు నిత్యం ప్రయాణాలు చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటే సుదూర ప్రాంతాలనుంచి రావలసి వస్తుంది. వంగర, సంతకవిటి నుంచి నిత్యం విద్యార్థులు ఉన్నత చదువులకు రాజాం పాఠశాలలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయించవలసి వస్తుంది. ఆటో డ్రైవర్లు సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కిస్తుండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.