కొత్తవలస మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం చురుగ్గా సాగుతోంది. ఈ నేపథ్యంలో దెందేరు గ్రామంలో జనసేన పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి మలువలస శ్రీనివాస్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. అర్హత గల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.