ఎస్. కోట మండలంలో గల గిరిజన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 15 తర్వాత ఆందోళనలు చేపడతామని సిపిఎం మండల కమిటీ హెచ్చరించింది. గిరిజన గ్రామాల్లో మౌళిక సౌకర్యాలు, మినీ హెల్త్ సెంటర్లు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతూ తాసిల్దార్ అరుణకుమారి కి సిపిఎం నాయకులు శుక్రవారం మండల పార్టీ కార్యదర్శి మద్దిల రమణ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. తక్షణమే గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.