ఎస్ కోట మండలం చిట్టెంపాడు కు చెందిన 6 గురు విద్యార్థులు కల్తీ ఆహారం తినడంతో అనారోగ్యానికి గురై ఎస్ కోట పీహెచ్సి లో వైద్య చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శుక్రవారం వారిని పరామర్శించారు. ఈ మేరకు ఆయన విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యాధికారిణి నీల ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు త్వరితగతిన కోలుకునేందుకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.