వేపాడ మండలంలో రహదారులకు మరమ్మతులు కార్యక్రమం

60చూసినవారు
వేపాడ మండలంలో రహదారులకు మరమ్మతులు కార్యక్రమం
వేపాడ మండలం బొద్దాం గ్రామం నుండి ముకుందపురం కు వెళ్లే రహదారిలో భారీ గుంతలు పడడంతో వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో స్థానిక సర్పంచ్ నాగిరెడ్డి కనకరాజు సహకారంతో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ రహదారి మరమ్మతులకు గురికావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు మరమ్మతుల పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్