వేపాడ మండలం బొద్దాం గ్రామం నుండి ముకుందపురం కు వెళ్లే రహదారిలో భారీ గుంతలు పడడంతో వాహనచోదకులు తీవ్ర అవస్థలు పడుతున్న నేపథ్యంలో స్థానిక సర్పంచ్ నాగిరెడ్డి కనకరాజు సహకారంతో గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ రహదారి మరమ్మతులకు గురికావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు మరమ్మతుల పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.