ఖరీఫ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుండడంతో విజయనగరం జిల్లాలో రైతన్నలు వేసవి దుక్కులు దున్ని పొలాలను సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. ఒక పక్క వేసవి ఎండలు మండుతుండగా మరో పక్క అరకొరగా అకాల వర్షాలు అక్కడక్కడ పడుతుండడంతో దుక్కు లు మొదలుపెట్టారు. జూన మొదటి వారం నుంచి జూలై వరకు పంట పొలాలను చదను చేసుకోవడం ద్వారా పంటలకు అనుకూలంగా ఉంటుందని రైతులు తెలుపుతున్నారు.