విజయనగరం పట్టణంలోని బాబామెట్ట సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ అశోక్ నగర్ ఫీడర్ లైన్ లో చెట్ల కొమ్మలు తొలగించనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10. 30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏపీఈపీడీసీఎల్ ఈఈ పి. త్రినాథరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డబుల్ కాలనీ, దర్గా ఏరియా, కేంద్రీయ విద్యాలయం ఏరియా, ఏడుకోవెళ్లు, బాబామెట్ట మిడిల్ పిచ్ ఏరియాలో సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు.