AP: రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు ఇబ్బందులు పడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నారంటూ వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎక్కడ చస్తే నాకేంటి అన్నట్టు పవన్ వ్యవహరిస్తున్నారని.. తనకు ప్యాకేజీ, పవర్ ఉంటే చాలు అన్నట్లు ఉన్నారని రోజా విమర్శించారు. రాష్ట్రంలో వరుసగా ఆలయాలు కూలిపోతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అని రోజా ప్రశ్నించారు.