ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి తిరుపతి పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా తిరుపతి పర్యటన రద్దు చేసుకుని విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లనున్నారు. ఆరోగ్యం మెరుగు పడిన తర్వాత పవన్ తిరుపతికి వెళ్లే అవకాశం ఉందని జనసేన వర్గాలు వెల్లడించాయి.