అల్లూరి జిల్లాలోని పెదపాడు గ్రామంలో 300 మంది గిరిజనులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాదరక్షలు పంపించారు. ఇటీవల ఆ గ్రామంలో పర్యటించిన సమయంలో అక్కడ ఎక్కువ మంది పాదరక్షలు లేకుండా ఉండటాన్ని గమనించిన పవన్, వెంటనే పాదరక్షలు పంపించాలని ఆదేశించారు. దీంతో పవన్ ఆదేశాల మేరకు ఆయన పేషీ బృందం గ్రామాన్ని తిరిగి సందర్శించి, 300 మంది గిరిజనులకు పాదరక్షలు పంపిణీ చేసింది.