ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. ఎస్వీ గోశాలలో ఆవుల మృతి చెందాయని భూమన విమర్శలు చేయగా టీడీపీ, వైసీపీ మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని తర్వాత టీటీడీ గోశాలను పరిశీలించనున్నారు. ఈ మేరకు గోశాలకు వెళ్లి గోవుల మృతి అంశంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.