పవన్ ఆదేశాలు.. సరస్వతి భూముల్లో సర్వే

50చూసినవారు
పవన్ ఆదేశాలు.. సరస్వతి భూముల్లో సర్వే
వైఎస్ జగన్, షర్మిల ఆస్తుల వివాదం వేళ వారి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ సంస్థ పేరు తెరపైకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి వద్ద ఈ సంస్థకు చెందిన 1,515 ఎకరాల భూముల్లో అటవీ భూములు కూడా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ భూముల్లో ఎంత మేర అటవీ భూములు ఉన్నాయో పూర్తి విరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సర్వే మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్