ఏపీలో ‘తండేల్’ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత ప్రకటన జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్లో ఒక్కో టికెట్పై రూ.50.. మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై రూ.75 పెంపుకు సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. సినిమా రిలీజైన వారం రోజులు వరకు ఈ ధరలు కొనసాగుతాయి. నాగచైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ ఈనెల 7న రిలీజ్కానుంది.