పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు జాతీయోద్యమాలతో పాటు మునగాల జమీందారు కోరిక మేరకు అక్కడే ఉండి కంబోడియా పత్తి రకంపై పరిశోధనలు చేసి పత్తి వెంకయ్యగా పేరు తెచ్చుకున్నారు. జియాలజీలో పట్టభద్రుడైన అతను ఆంధ్రప్రదేశ్లో వజ్రాల తవ్వకాలలో రికార్డు సృష్టించాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత వెంకయ్య నెల్లూరులో స్థిరపడి నవరత్నాల మీద అనేక పరిశోధక వ్యాసాలు రాశాడు. ఈ అంశంలో భారత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన వెంకయ్యను.. డైమండ్ వెంకయ్యగానూ పిలిచేవారు.