ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భూమికి భద్రత కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, చర్యలకు సీఐడీకి సిఫార్సు చేసిందన్నారు.