AP: గంజాయి ముఠాల ఆటకట్టించేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మహిళలపై నేరాల విషయంలో పోలీసుశాఖ కఠినంగా వ్యవహరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లు నేరగాళ్లపై నియంత్రణ లేదని.. గంజాయి, డ్రగ్స్ వాడకంతో చట్టం అంటే భయం లేకుండా పోయిందన్నారు. ఆడబిడ్డలపై క్షణికావేశంలోనో, గంజాయి మత్తులోనో నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాలని సీఎం పేర్కొన్నారు.