AP: సోషల్ మీడియా వేదికగా పాక్ అనుకూల పోస్టులు పెడుతున్న వారిపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. కొందరు పాకిస్తాన్ కు మద్దతుగా పోస్టులు పెడుతూ.. మత ఘర్షణలకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటివారిపై దృష్టి సారిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. త్వరలోనే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు.