AP: సీఎం చంద్రబాబు దంపతులు ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. "మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ 1 లేదా నంబర్ 2 దేశంగా అభివృద్ధి చెందుతుంది. నా ఆలోచన ఒక్కటే. నా దృష్టిలో రామరాజ్యం అంటే.. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవడమే. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం అనేది ఉండకూడదు. పేదరికం లేదని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాను’’ అని సీఎం పేర్కొన్నారు.