బాపట్ల జిల్లాకు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టాలని, ఆర్థిక రాజధానిగా పేరు ఉన్న చీరాలను జిల్లా కార్యనిర్వహణ కేంద్రంగా మార్చాలని ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఆలా వెంకటేశ్వరరావు అలియాస్ శ్రీధర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన చీరాలలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలపై ఇల్లిల్లు తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.