గిద్దలూరు పట్టణంలోని ఒకటవ వార్డులో నూతన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వర్షం పడితే అడుగు తీసి అడుగు వేయాలని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో సిమెంటు రోడ్లు వేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.