ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని చౌక్ సెంటర్ లో గురువారం వీధి కుక్కలను నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వీధి కుక్కలను పట్టుకొని స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లుగా అధికారులు తెలిపారు. కొద్దిగా కాలంగా వీధి కుక్కల బెడదతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ అధికారులు వీధి కుక్కలను పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.