పామూరు మండలంలోని బొట్లగూడూరు పంచాయతీ రంగస్వామి పాకాల గ్రామంలో పంచాయతీ నిధులతో ఇంటింటి కులాయి కార్యక్రమంలో భాగంగా మంచినీటి బోర్ ను రాష్ట్ర టిడిపి కార్యదర్శి కోటపాటి జనార్ధన్ రావు శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.