ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం హనుమంతుని పాడు మండలం కృష్ణంపల్లి గ్రామంలో గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాల మేరకు కృష్ణంపల్లి గ్రామ టీడీపీ నేత కొమెర్ల అచ్చయ్య లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు.