బస్సు నడిపిన ఎమ్మెల్యే ఉగ్ర

55చూసినవారు
కనిగిరి ఏపీఎస్ఆర్టీసీ డిపోకు 40 కొత్త బస్సులను ప్రభుత్వం కేటాయించింది. ఆదివారం కొన్ని బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయనే ఒక బస్సును స్వయంగా కనిగిరి డిపో నుండి కొత్తూరు గ్రామం దాకా నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్