డయేరియా అరికట్టుటలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ లు చిత్తశుద్ధితో పనిచేయవలెనని కనిగిరి మున్సిపల్ కమిషనర్ రంగారావు అన్నారు. మంగళవారం కనిగిరిమున్సిపల్ కార్యాలయంలో మెప్మా రిసోర్స్ పర్సన్ లకు, మెప్మా సిబ్బందితో అవగాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైనందున నీరు కలుషితమై సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వ్యాధులు రాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.