సింగరాయకొండ: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

78చూసినవారు
సింగరాయకొండ: లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతిచెందిన సంఘటన శనివారం సింగరాయకొండ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఇదే సంఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా అన్నగారిపాలెం కు చెందిన భాస్కర్, పెంచలయ్య ద్విచక్ర వాహనంపై ఒంగోలుకు బయలుదేరారు సింగరాయకొండ వద్ద లారీ వెనకనుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భాస్కర్ మృతి చెందగా పెంచలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్