ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు లో కొండచిలువ కలకలం రేపింది. మంగళవారం గ్రామంలోని ఓ ఇంటి ఖాళీ స్థలంలో కొండచిలువ కనిపించింది. దీంతో హడలిపోయిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నెట్టులో చుట్టుకొని ఉన్న 7 అడుగుల కొండచిలువను అటవీశాఖ అధికారులు బంధించారు. స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. కొండచిలువను అధికారులు బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.