తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో శుక్రవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఇంటి బయట ఉన్న పిల్లలను, పెద్దలను, మహిళలను కరిచి గాయ పరిచింది. సాయి అనే బాలుడి పై దాడి చేసిన సమయంలో గమనించిన పెద్దలు పిచ్చికుక్కను తరిమిగొట్టారు. అతను తీవ్రంగా గాయపడటంతో వైద్యుల సిఫార్స్ మేరకు ఒంగోలు రిమ్స్ కు తరలించారు.