ఆటో కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు ఎస్. కె ఎం భాషా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మార్కాపురంలో ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆల్ ఇండియా పబ్లిక్ ట్రాన్స్ పోర్టు జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆటో కార్మికులు స్టాండ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటో స్టాండ్ లకు ప్రభుత్వమే స్థలం చూపించాలని ఆయన డిమాండ్ చేశారు.