అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా, 13 మంది కూలీలకు తీవ్ర గాయాలు.

67చూసినవారు
ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడ్డ సంఘటనలో 13 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డ సంఘటన ఆదివారం పొదిలి మండలం అగ్రహారం వద్ద జరిగింది. గాయపడ్డ వారిని పొదిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు కాటూరివారిపాలెం కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో 20 మంది ఉన్నారని వీరు చీమకుర్తి మండలం కంబాలపాడు గ్రామంలో పొలం పనులకు వెళ్లి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్