2024వ సంవత్సరంలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సిద్ధంగా ఉన్నాయని ఆర్ఐఓ సైమన్ విక్టర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ మార్చి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు ఉత్తర్వులు అయినా విద్యార్థుల ఉత్తీర్ణత సర్టిఫికెట్లను ఆర్ఐవో కార్యాలయం నుండి తీసుకువెళ్లాలని తెలిపారు. వాటిని తిరిగి విద్యార్థులకు పంపిణీ చేయాలన్నారు.