ఇండియన్ రెడ్ క్రాస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ముస్లిం మహిళల హక్కుల దినోత్సవ వేడుకలు ఒంగోలు రెడ్ క్రాస్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. కన్వీనర్ కోటేశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2017 ఆగస్టు 22న త్రిబుల్ తలాక్ రద్దు తీర్పు వచ్చిన తర్వాత దేశమంతా ఈ వేడుకలు నిర్వహిస్తారని కార్యదర్శి సుజాత తెలిపారు. అనంతరం పలువురు సన్మానించారు.