నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అన్సారియా ను శుక్రవారం ఒంగోలు జర్నలిస్టులు కలెక్టర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.